20 మంది కో ఆర్డినేటర్ల సస్పెన్షన్‌


కరీంనగర్‌: వయోజన విద్యాశాఖలో వీసీవోల వేతనాలు స్వాహా చేసిన 20 మంది మండల కోఆర్డినేటర్లను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లాలో వయోజన విద్యాశాఖ వీసీవోలకు చేరాల్సిన వేతనాలను మండల కోఆర్డినేటర్లు స్వాహా చేశారు. ఈ అంశంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు 20 మంది మండల కోఆర్డినేటర్లను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top