రెండు ఆటోలు ఢీ: ఇద్దరి దుర్మరణం


భూత్పూర్ : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులను తీసుకెళుతున్న రెండు ఆటోలు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top