రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా 2 కే రన్
సిద్దిపేట: రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సిద్దిపేటలో 2కే రన్ను నిర్వహించారు. ఈ రన్ను పోలీసు కమిషనర్ శివకుమార్, శాసనసభ్యుడు రామలింగారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం విభాగాల వారీగా బహుమతులు ప్రదానం చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్ వేణుగోపాల్రెడ్డి, సత్యనారాయణ, సతీష్కుమార్, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐలు సురేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకటేశం, ఎస్పైలు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.