ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు: డ్రైవర్ మృతి
హైదరాబాద్ : హయత్నగర్ మండలం పెద్దఅంబర్పేట వద్ద గల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే
స్పందించి.. క్షతగాత్రులను కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రికి మరికొంతమందిని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ సునీల్ (35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.