ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు: డ్రైవర్ మృతి


హైదరాబాద్ : హయత్నగర్ మండలం పెద్దఅంబర్పేట వద్ద గల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే

స్పందించి.. క్షతగాత్రులను కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రికి మరికొంతమందిని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ సునీల్ (35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 


Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top