డెంగీతో బాలిక మృతి


జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ జమాల్ కాలనీకి చెందిన ఓ బాలిక డెంగీతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికంగా నివాసముంటున్న ఆయేషా(12) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top