రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


సుల్తానాబాద్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అమరేందర్‌రెడ్డి(24) ఈ రోజు తెల్లవారుజామున బైక్‌పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top