అన్నదమ్ముల ఘర్షణ: తమ్ముడి మృతి


టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులగూడెంలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య వివాదంలో ఒకరు మృతి చెందారు. భూ వివాదంలో పత్తి స్వామి(35)కు, అతని అన్నకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పొలంలో ఉన్న స్వామిపై అన్న కొడుకులు దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top