పాకిస్తాన్కు షాక్
రెండో వన్డేలో జింబాబ్వే గెలుపు
హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ అనూహ్యంగా ఓడింది. లక్ష్య ఛేదనలో ముందుగా తడబడినా.. షోయబ్ మాలిక్ (96 నాటౌట్), ఆమిర్ యామిన్ (62)ల వీరోచిత బ్యాటింగ్తో విజయం అంచులదాకా వెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశలో బ్యాడ్లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ను ఆపేశారు.
ఫలితంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే 5 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్లకు 276 పరుగులు చేసింది. చిబాబా (90), చిగుంబరా (67), బ్రియాన్ చారి (39), రజా (32)లు రాణించారు. వహబ్ రియాజ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత పాకిస్తాన్ 48 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది.