సచిన్పై అదే అభిమానం
మెల్బోర్న్: క్రికెట్కు గుడ్బై చెప్పి దాదాపు రెండేళ్లు కావస్తున్నా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మెల్బోర్న్లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిశాక అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన సచిన్ను చూసి ప్రేక్షకులు పెద్ద పెట్టున చప్పట్లతో, కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కూడా ఉన్న ఈ వేదికపై సచిన్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను ప్రదానం చేశాడు. ప్రేక్షకులను చూసి సచిన్ చిరునవ్వుతో చేయి ఊపుతూ కనిపించాడు.