చెన్నై నం.1 స్థానానికి చేరుకుంటుందా?
ఐపీఎల్-8 లో భాగంగా శనివారం ఎం ఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని ధోనీ సేన తహతహలాడుతోంది.
ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న చెన్నై సైపర్ కింగ్స్.. రాజస్థాన్ కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉంది. బెయిలీ సేనపై విజయ ఢంకా మోగించి రాజస్థాన్ ను వెనక్కి నెట్టెయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే గత మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో గెలిచి మంచి ఊపుమీదున్న పంజాబ్ అదే జోరును కొనసాగించి చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.