ఒకే ఓవర్లో 5 సిక్సర్లు

ఒకే ఓవర్లో 5 సిక్సర్లు


లౌడర్హిల్: అమెరికాలో టీమిండియాతో జరుగుతున్న తొలి టీ-20లో వెస్టిండీస్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, ఎవిన్ లెవిస్ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించారు.  



లెవిస్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 82 నాటౌట్), చార్లెస్ (33 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 79) సూపర్ హాఫ్ సెంచరీలు చేశారు. బిన్నీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లెవిస్ 5 సిక్సర్లు సంధించాడు. వైడ్, ఓ సింగిల్తో కలిపి ఈ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. విండీస్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. చార్లెస్ను భారత బౌలర్ షమీ అవుట్ చేశాడు.



కాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top