సెహ్వాగ్ 'అప్గ్రేడ్' ట్వీట్!
న్యూఢిల్లీ: ఇటీవలకాలంలో తన ట్వీట్లతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో ఆఫ్ బీట్ట్వీట్తో అలరించాడు. ఇప్పటికే ఎన్నో ట్వీట్లతో మనల్ని ఆలోచనలో పడేసిన సెహ్వాగ్.. ఈసారి తన ట్వీట్కు రెజ్లర్ యోగేశ్వర్ దత్ను ఎంచుకున్నాడు.
లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్కు ఇప్పుడు రజత పతకానికి అప్ గ్రేడ్ అవడమే సెహ్వాగ్ ట్వీట్కు కారణమైంది. 'చాలా బాగుంది. యూఎస్లో క్రికెట్ అప్ గ్రేడ్ అయినట్లు, భారత బౌలర్ ఆశిష్ నెహ్రా స్మార్ట్ ఫోన్కు అప్ గ్రేడ్ అయినట్లు, 2012లో యోగేశ్వర్ సాధించిన కాంస్య పతకం.. ఇప్పుడు రజతానికి అప్ గ్రేడ్ అయ్యింది' అని ట్వీట్ చేశాడు.
ఈ తాజా సెహ్వాగ్ ట్వీట్ పై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ట్విట్టర్లో సెహ్వాగ్ బెస్ట్ మ్యాన్గా అప్ గ్రేడ్ అయ్యాడంటూ ధోని ప్రశంసించగా, అతని ట్వీట్లు పసందుగా ఉన్నాయంటూ సచిన్ కొనియాడాడు.
Wah !Cricket upgraded in US, NehraJi upgraded to smartphone and now #YogeshwarDutt 's 2012 bronze likely to be upgraded to silver. #Upgrade
— Virender Sehwag (@virendersehwag) 30 August 2016
సంబంధిత వార్తలు