సెహ్వాగ్..నువ్వు కూడా దరఖాస్తు చేసుకో!

సెహ్వాగ్..నువ్వు కూడా దరఖాస్తు చేసుకో!


ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ఎంతమంది రేసులో ఉంటారనేది అంచనా వేయడం కష్టంగా మారింది. ఈసారి దిగ్గజ క్రికెటర్ల నుంచి భారీ పోటీ ఉంటుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అయితే కోచ్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవల సెహ్వాగ్ ను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోమని బీసీసీఐలోని ఒక పెద్దాయన కోరినట్లు తెలుస్తోంది.


 


ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల)లో కింగ్స్ పంజాబ్ కు కోచ్ గా వ్యవహరించే సమయంలో సెహ్వాగ్ ను టీమిండియా కోచ్ దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చారట. టీమిండియా కోచ్ గా అప్లై చేయమని సెహ్వాగ్ కు ఆశలు కల్పించడంతో మరి అతగాడు ఏం చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఏడాది కాలంగా ప్రధాన కోచ్ గా పని చేస్తున్న అనిల్ కుంబ్లే.. ఈసారి నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top