ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఆరో స్థానంలో ధావన్
దుబాయ్: ప్రపంచకప్లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు అంచనాలకు తగ్గ రీతిలో రాణించకపోయినా కోహ్లి తన నాలుగో స్థానాన్ని నిలుపుకున్నాడు. డివిలియర్స్ టాప్లో ఉన్నాడు. బౌలింగ్లో ఆసీస్ పేసర్ స్టార్క్ తొలిసారిగా నంబర్వన్ ర్యాంకును అందుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్కు ఈనెల 1న కటాఫ్ తేదీ కావడంతో ఆసీస్ టాప్ జట్టుగా నిలిచి లక్షా 75 వేల డాలర్ల (దాదాపుగా రూ.కోటీ 10 లక్షలు)ను అందుకోనుంది. భారత్కు రెండో ర్యాంకుతో 75 వేల డాలర్లు (దాదాపుగా రూ.47 లక్షలు) దక్కనున్నాయి.