విరాట్.. మోస్ట్ పాపులర్ క్రికెటర్
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా ప్రమోషన్ పొందిన యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియాలోనూ విరాట్ హవా కొనసాగుతోంది. ట్విట్టర్లో అత్యంత ఆదరణ గల క్రికెటర్ కోహ్లీనే.
ట్విట్టర్లో మొన్నటివరకు అత్యధిక ఫాలోయర్స్ ఉన్న క్రికెటర్గా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను అధిగమించిన విరాట్.. తాజాగా మరో ఘనత సాధించాడు. 50 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న తొలి క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. ట్విట్టర్లో విరాట్కు 5,004,544 మంది ఫాలోయర్స్ ఉన్నారు. సచిన్కు 4,910,498 మంది, టెస్టులకు గుడ్ బై చెప్పిన ధోనీకి 3,374,509 మంది ఫాలోయర్స్ ఉన్నారు. విరాట్కు కేవలం మూడు నెలల్లోనే పది లక్షల మంది ఫాలోయర్స్ పెరగడం విశేషం. విరాట్ తన ఫాలోయర్స్కు కృతజ్ఞతలు తెలిపారు.