మరోసారి నిరాశపరిచిన కోహ్లి
కాన్పూర్:న్యూజిలాండ్ తో జరుగుతున్న భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్లో కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులు చేసిన కోహ్లి... రెండో ఇన్నింగ్స్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి టచ్లోకి వచ్చినట్లు కనిపించిన కోహ్లి క్రెయిగ్ బౌలింగ్లో స్వీప్ షాట్కు యత్నించి విఫలమయ్యాడు.
159/1 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు ఆరంభంలో మురళీ విజయ్, పూజారాలు నిలకడను ప్రదర్శించారు. అయితే జట్టు స్కోరు 185 వద్ద ఉండగా విజయ్(76) సాంట్నార్ బౌలింగ్ అవుటయ్యాడు. అనంతరం కోహ్లి(18), పూజారా (78)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు.
సంబంధిత వార్తలు