వరుణ్ సంచలన బౌలింగ్
మొహాలీ: రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బి లో రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్ వరుణ్ కన్నా సంచలన బౌలింగ్ తో అదరగొట్టాడు. వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో ఎనిమిది వికెట్లు తీసి రైల్వేస్ కు ఊహించని షాకిచ్చాడు. శనివారం రైల్వేస్ కోల్పోయిన ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నవరుణ్.. ఈ రోజు మరో మూడు వికెట్లు తీసి రైల్వేస్ ను కోలుకోనీయకుండా చేశాడు. దీంతో పంజాబ్ కు ఇన్నింగ్స్ 126 పరుగుల భారీ విజయం లభించింది. దీంతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను వరుణ్ (8/97) నమోదు చేశాడు.
125/5 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట ప్రారంభించిన రైల్వేస్ 282 పరుగులకే చాపచుట్టేసింది. రైల్వేస్ ఆటగాడు అరవింద్ ఘోష్ (98*) పరుగులతో ఆకట్టుకున్నా.. అతనికి అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. తాజా విజయంతో పంజాబ్ కు ఏడు పాయింట్లు లభించగా, రైల్వేస్ ఇంకా ఖాతాను తెరవలేదు.
పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 604/5 డిక్లేర్
రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ 196, రెండో ఇన్నింగ్స్ 282