ఎదురులేని యువ భారత్

ఎదురులేని యువ భారత్


అఫ్ఘానిస్తాన్‌పై భారీ విజయం

  అండర్-19 ముక్కోణపు టోర్నీ

 కోల్‌కతా:
ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భారత యువ జట్టు అండర్-19 ముక్కోణపు టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై 104 పరుగులతో ఘన విజయం సాధించింది. లీగ్ దశలో బంగ్లాదేశ్, అప్ఘాన్‌లతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిచింది. ఆదివారం జరిగే ఈ టోర్నీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.



 శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (98 బంతుల్లో 118; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా.... విరాట్ సింగ్ (71) రాణించాడు. కెప్టెన్ రికీ భుయ్ (50) కూడా అర్ధసెంచరీ చేశాడు. అఫ్ఘానిస్తాన్ అండర్-19 జట్టు 28 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయింది. నవీద్ ఒబిద్ (63) మినహా అందరూ విఫలమయ్యారు. జీషన్ అన్సారీ ఐదు వికెట్లు తీశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top