రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు సరిపోవు

రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు సరిపోవు


ఆసీస్ పర్యటనపై గంగూలీ అభిప్రాయం



 న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బాగా సన్నద్ధం కావాలంటే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు సరిపోవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ షెడ్యూల్ అంత బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘తొలి టెస్టుకు ముందు రెండు ఇన్నింగ్స్‌లు ఆడితే సరిపోదు. ఇది సరైంది కాదు. కోహ్లిలాంటి ఆటగాడికే గాడిలో పడాలంటే నాలుగు ఇన్నింగ్స్‌లు అవసరం’ అని దాదా పేర్కొన్నాడు.

 

 ధోని, కోహ్లి వివరణ ఇవ్వరు

 ఆటకు సంబంధించిన ఏ విషయంలోనైనా తాను ఆటగాళ్లకు చాలా వివరణలు ఇచ్చే వాడినని దాదా తెలిపాడు. అయితే ఈ విషయంలో ధోని, కోహ్లి వెనుకబడి ఉన్నారన్నాడు. ‘బ్రిస్బేన్ టెస్టులో నేను కుంబ్లేను తప్పించా. ఆ తర్వాత జరిగిన జట్టు సమావేశం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. దీనిపై బాగా ఆలోచించిన తర్వాత అతనికి నా నిర్ణయం చెప్పా.



నెహ్రాతో అయితే పెద్ద సమస్యే వచ్చేది. అతన్ని పక్కన కూర్చోబెట్టడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చేది. చాలా ఓపికగా అతనికి కారణాలు చెప్పేవాడ్ని. ఇక కివీస్ టూర్‌లో అయితే హర్భజన్‌తో ఫైటింగే చేయాల్సి వచ్చింది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top