21 బంతుల్లోనే సెంచరీ!

21 బంతుల్లోనే సెంచరీ!


రికార్డు సృష్టించిన ట్రినిడాడ్ క్రికెటర్



ట్రినిడాడ్: సంచలనాలకు మారు పేరైన టి20 క్రికెట్‌లో మరో మెరుపు రికార్డు నమోదైంది. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో బ్యాట్స్‌మన్ ఇరాఖ్ థామస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 21 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. టి20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. టొబాగో క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీలో స్కార్‌బారో తరఫున బరిలోకి దిగిన అతను, స్పీ సైడ్ టీమ్‌పై ఈ ఘనత సాధించాడు.



మ్యాచ్ ముగిసేసరికి 23 ఏళ్ల ఇరాఖ్ 31 బంతుల్లోనే 15 సిక్సర్లు, 5 ఫోర్లతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గతంలో ట్రినిడాడ్ జట్టులో అండర్-13 స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అతను, జాతీయ అండర్-19 ప్రాబబుల్స్‌లో కూడా ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణేపై క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top