'ప్రపంచ కప్ ముందు.. ఆ సిరీస్ శుద్ధ దండగ'
పెర్త్: ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాలో భారత్ ముక్కోణపు సిరీస్ ఆడటం వల్ల సమయం, శక్తి వృథా అయిందని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి అన్నాడు. ఈ సిరీస్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు మానసికంగా బాగా అలసిపోయారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్కు వారు మానసికంగా సన్నద్ధం కావడానికి విశ్రాంతి తీసుకున్నారని, ఆ విరామం వారిని ఉత్తేజపరిచిందని రవిశాస్త్రి చెప్పాడు.
ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు, ముక్కోణపు సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీస్లలో భారత్ చెత్తగా ఓడిపోయింది. అయితే ప్రపంచ కప్లో ఒక్కసారిగా పుంజుకుని హ్యాట్రిక్ విజయంతో నాకౌట్ దశకు చేరువైంది. ప్రపంచ కప్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని రవిశాస్త్రి అన్నాడు. ధోనీసేన సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసమందని చెప్పాడు. టీమిండియా సత్తామేరకు ఆడితే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్లపై మాదిరిగా ఘనవిజయం సాధించడం తథ్యమని అన్నాడు.
సంబంధిత వార్తలు