ఆధిక్యం దిశగా న్యూజిలాండ్
లార్డ్స్: కేన్ విలియమ్సన్ (141 బంతుల్లో 92 బ్యాటింగ్; 12 ఫోర్లు), మార్టిన్ గప్టిల్ (115 బంతుల్లో 70; 8 ఫోర్లు; 1 సిక్స్) విశేషంగా రాణించడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 77 ఓవర్లలో రెండు వికెట్లకు 303 పరుగులు చేసింది.
క్రీజులో విలియమ్సన్తో పాటు టేలర్ (109 బంతుల్లో 47 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 86 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లు గప్టిల్, లాథమ్ (98 బంతుల్లో 59; 10 ఫోర్లు) తొలి వికెట్కు 148 పరుగులు జోడించారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 100.5 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌటయింది. మొయిన్ అలీ (107 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. బౌల్ట్, హెన్రీలకు నాలుగేసి వికెట్లు దక్కాయి.