టాప్-5లో ముగ్గురు వాళ్లే!
వెల్లింగ్టన్: వరల్డ్ కప్ లో లంకేయులు దూసుకుపోతున్నారు. పరుగుల వరద పారిస్తూ పాయింట్ల పట్టికలో ముందున్నారు. ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచుల్లో శ్రీలంక బ్యాట్స్ మన్ సత్తా చాటారు. పరుగుల వీరుల జాబితాలో వారే ముందున్నారు. అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాట్స్ మెన్ లిస్టులో ముగ్గురు లంకేయులు చోటు సంపాదించారు.
4 మ్యాచ్ లు ఆడిన సీనియర్ ఆటగాడు కుమార సంగక్కర 268 పరుగులతో టాప్ లో ఉన్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 258 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లాహిరు తిరిమన్నె(256), తిలకరత్నె దిల్షాన్(229) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 224 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.
డివిలియర్స్(6), షాయ్ మాన్ అన్వర్(7), బ్రెండన్ మెక్ కల్లమ్(8), విలియమ్స్(9), శామ్యూల్స్(10) టాప్ టెన్ లో చోటు సంపాదించారు. సంగక్కర దూకుడు చూస్తుంటే టోర్నీ చివరివరకు అగ్రస్థానాన్ని అతడు కాపాడుకునేలా ఉన్నాడు.