వాళ్లు 11 మంది... మేం 10 మంది
యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. దీనికి కారణం ఆతిథ్య జట్టు 11 మందితో ఆడితే... ఆసీస్ 10 మందితోనే ఆడిందట. ఇదేంటనుకుంటున్నారా... ఆ జట్టు కెప్టెన్ క్లార్క్ ఇదే చెబుతున్నాడు మరి. ఈ మ్యాచ్లో క్లార్క్ రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 13 పరుగులు చేశాడు. అంతేనా స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తూ చేతిలో పడ్డ క్యాచ్ వదిలేశాడు. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో కలిపి 94 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ బాధనంతా మ్యాచ్ ముగిశాక వెళ్లగక్కాడు. తానే జట్టుకు భారమని వాపోయాడు. ‘ప్రత్యర్థి జట్టులో 11 మంది ఉన్నప్పుడు మన జట్టులో 10 మందే ఉంటే కచ్చితంగా ఓడిపోతాం. మా పరిస్థితి ఇదే. నా ఫామ్ ప్రభావం జట్టుపై పడుతోంది. కెప్టెన్గా సహచరులకు ఆదర్శంగా ఉండాల్సిన నేను దారుణంగా విఫలమవుతున్నాను’ అని క్లార్క్ బాధపడ్డాడు. ఏమైనా ఓడిపోయినప్పుడు ఇలా తప్పు మీదేసుకోవడానికి కెప్టెన్కి చాలా ధైర్యం ఉండాలి.