ఫోర్ కొట్టకుండానే నాలుగు పరుగులు..
పెర్త్: ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ వార్నర్, స్మిత్ లు ఇద్దరు వికెట్ల మధ్య నాలుగు పరుగులు తీశారు. ఓక్స్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా తరలించిన స్మిత్.. స్టూవర్ట్ బ్రాడ్ బంతిని విసిరే లోపే వికెట్ల మధ్య నాలుగు పరుగులు తీశారు. తొలి ఓవర్ లోనే ఫించ్ (0) అవుటయిన సంగతి తెలిసిందే.
ఈ మాదిరిగానే ఇంగ్లండ్పై సిడ్నీ వన్డేలో భారత బ్యాట్స్మెన్లు కూడా నాలుగు పరుగులు తీశారు. ఒకే సిరీస్లో రెండుసార్లు రిపీట్ అవడం విశేషం. అయితే ఆ మ్యాచ్లో భారత్ ఓడింది. మరి ఈ మ్యాచ్లో ఆసీస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు స్కోరు వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ 17 బంతుల్లో 12, స్మిత్ 10 బంతుల్లో 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.