'అమెరికన్లు క్రికెట్ బ్యాట్లు పట్టాలి'
వాషింగ్టన్: అమెరికా వాసులు బేస్బాల్ బ్యాట్లతో పాటు క్రికెట్ బ్యాట్లు పడితే చూడాలని ఉందని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించడం కోసం సచిన్ తన వంతు కృషి చేస్తున్నాడు. 'అమెరికన్లు బేస్బాల్ చూడటాన్ని ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. అమెరికన్లు కనుక క్రికెట్ చూసేందుకు స్టేడియానికి వస్తే.. ఆటను ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్లను ఫాలో అవుతారు' అని సచిన్ అన్నాడు.
షేన్ వార్న్, వసీం అక్రమ్, లారా, కలిస్, మహేల తదితర దిగ్గజాలతో కలసి సచిన్ అమెరికాలో టి-20 మ్యాచ్లు ఆడనున్న సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లిన సచిన్ అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అమెరికాలో మాజీ క్రికెటర్లు మూడు టి-20 మ్యాచ్లు ఆడనున్నారు.