తెలంగాణకు మూడు కాంస్యాలు

తెలంగాణకు మూడు కాంస్యాలు


జాతీయ స్కూల్ గేమ్స్ రెజ్లింగ్‌సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయిలు మెరిశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన అండర్-19 బాలికల రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఎస్. శ్యామల, పి.శిరీష, ఎం.మౌనిక కాంస్య పతకాలు గెలుపొందారు. ఈ ముగ్గురు కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. ట్రినిటీ జూనియర్ కాలేజికి చెందిన శ్యామల 51 కేజీల విభాగంలో, శిరీష 55 కేజీల విభాగంలో కాంస్యాలు గెలిచారు.



రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన మౌనిక 59 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గింది. తెలంగాణ పాఠశాల విద్యా జాయింట్ డెరైక్టర్ పి.వి.శ్రీహరి సోమవారం తన చాంబర్‌లో పతక విజేతలను అభినందించారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి కె.రామ్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎల్.రాజేందర్ ప్రసాద్‌లు కూడా వారి ప్రదర్శనను కొనియాడారు. రాష్ట్ర రెజ్లింగ్ కోచ్ శ్రీనివాస్, జట్టు కోచ్ వాణిశ్రీ, మేనేజర్ బి.లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top