సెమీస్‌లో తెలంగాణ

సెమీస్‌లో తెలంగాణ


జాతీయ జూనియర్, యూత్ టీటీ



 అలెప్పీ (కేరళ): జాతీయ జూనియర్, యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిల జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్‌ను 3-2తో ఓడించిన తెలంగాణ జట్టు సెమీస్‌లో కేరళతో తలపడుతుంది. 76వ సీజన్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ జట్టు తొలిసారి పాల్గొంది. నైనా జైస్వాల్ తానాడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆకుల శ్రీజ ఒక మ్యాచ్‌లో నెగ్గి తెలంగాణ సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించింది. తొలి సింగిల్స్‌లో నైనా11-7, 10-12, 11-7, 11-3తో షోబబ్తి మెయిత్రాపై... రెండో సింగిల్స్‌లో 6-11, 11-7, 7-11, 11-8, 11-7తో ప్రాప్తి సేన్‌పై గెలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top