భరద్వాజ్కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: హాంకాంగ్లో జరిగిన ఆర్నాల్డ్ క్లాసికల్ ఆసియా మల్టీ స్పోర్ట్స్ ఫెస్టివల్లో తెలంగాణ క్రీడాకారుడు సత్తా చాటాడు. జంప్రోప్ చాంపియన్షిప్లో భారత్ తరఫున ఉత్కర్ష్ భరద్వాజ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక్కడి వరల్డ్ ఆసియా ఎక్స్పో సెంటర్లో ఈనెల 20 నుంచి 24 వరకు జంప్రోప్ చాంపియన్షిప్ జరిగింది. ఈ పోటీల్లో తెలంగాణ జంప్రోప్ సంఘం జనరల్ సెక్రటరీ టి. బాలరాజు అధికారిగా పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు