ఎనిమిదో వికెట్టు కోల్పోయిన టీమిండియా(203/8)
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 203 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్టును కోల్పోయింది. శిఖర్ థావన్(81) పరుగులు చేసి ఎనిమిదో వికెట్టు రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు.
లంచ్ సమయానికి ముందే టీమిండియా ఆటగాళ్లు ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు. కోహ్లి ఒక్క పరుగు చేసి అవుటవ్వగా, రహానే పది పరుగులు చేశాడు. ధోని, రోహిత్ శర్మ లు డకౌట్ గా వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 408 పరుగులకు, ఆస్ట్రేలియా 505 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ప్రస్తుతం టీమిండియా 106 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.