బ్యాట్స్మెన్దే భారం
నేడు ఢిల్లీతో సన్రైజర్స్ ఢీ
సాక్షి, విశాఖపట్నం: గత మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి బంతి దాకా పోరాడిన సన్రైజర్స్ హైదరాబాద్ ‘హోంగ్రౌండ్’లో తొలి విజయంపై దృష్టి పెట్టింది. శనివారం ఇక్కడ జరిగే మ్యాచ్లో సన్రైజర్స్, ఢిల్లీ డేర్డెవిల్స్తో తలపడుతుంది. ఇరు జట్లు కూడా ఆడిన మూడు మ్యాచ్లలో రెండు ఓడి ఒకదాంట్లో గెలిచాయి.
రాజస్థాన్తో మ్యాచ్లో ప్రభావం చూపలేని సన్రైజర్స్ బ్యాట్స్మెన్ ఈ సారైనా చెలరేగి భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. వార్నర్, ధావన్ విఫలమైతే చాలు... అది జట్టు ఇన్నింగ్స్పై ప్రభా వం చూపిస్తోంది. గురువారం మ్యాచ్లో ధాటిగా ఆడలేకపోయిన ఇద్దరు విదేశీ బ్యాట్స్మెన్ మోర్గాన్, బొపారా రాణించాల్సి ఉంది. బౌల్ట్ బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. కరణ్ శర్మ మరోసారి కీలకం కానున్నాడు. మరోవైపు పంజాబ్పై విజయంతో ఢిల్లీ ఆత్మవిశ్వాసం పెరిగింది. యువీ ఫామ్లోకి రాగా, మ్యాథ్యూస్ ఫలి తాన్ని మార్చగల సమర్థుడు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. శుక్రవారం విశాఖ జిల్లాలో పలు చోట్ల వాన కురిసింది. అయితే మ్యాచ్కు వర్షం అడ్డంకి కాకపోవచ్చు.