సుమీత్ జంట సంచలనం

సుమీత్ జంట సంచలనం - Sakshi


ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీపై గెలుపు

 తొలి రౌండ్‌లోనే కశ్యప్ ఓటమి

 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ


 

 బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. తొలి రౌండ్‌లో సుమీత్-మనూ అత్రి ద్వయం 9-21, 21-17, 21-17తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట చాయ్ బియావో-మా జిన్ (చైనా) ను బోల్తా కొట్టించింది.

 

  మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21-12, 20-22, 21-14తో అమిలియా-ఫీ చో సూంగ్ (మలేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్  తొలి రౌండ్‌లో 13-21, 12-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-8, 21-12తో బెలాట్రిక్స్ మనుపుట్టి (ఇండోనేసియా)పై గెలిచింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top