పాకిస్తాన్ 209/9


శ్రీలంకతో మూడో టెస్టు

 పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ ఓ మాదిరిగా ఆడుతోంది. సర్ఫరాజ్ అహ్మద్ (94 బంతుల్లో 72 బ్యాటింగ్; 6 ఫోర్లు), అజహర్ అలీ (96 బంతుల్లో 52; 8 ఫోర్లు) ఆదుకోవడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.

 

  సర్ఫరాజ్‌తో పాటు ఇమ్రాన్ ఖాన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మిస్బాసేన ఇంకా 69 పరుగులు వెనుకబడి ఉంది. దమ్మిక ప్రసాద్, ప్రదీప్ చెరో 3 వికెట్లు, కౌశల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఆరు పరుగులు జోడించి కౌశల్ (18), ప్రదీప్ (0) అవుటయ్యారు. యాసిర్ షా 5 వికెట్లు తీశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top