పది ఓవర్లలో శ్రీలంక స్కోరు 48/2


పుణె:మూడు టీ 20ల సిరీస్ లో ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో శ్రీలంక 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.


 


భారత్ విసిరిన 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లంకేయులు ఆదిలో రెండు వికెట్లను కోల్పోయినా.. ఆ తరువాత నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. శ్రీలంక ఆటగాళ్లలో డెక్ వెల్లా(4), గుణతిలకా(9) పెవిలియన్ కు చేరారు. చండిమాల్(16), కపుగదరె(23)లు క్రీజ్ లో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top