తిరుమన్నె హాఫ్ సెంచరీ.. దిల్షాన్ అవుట్
వెల్లింగ్టన్: శ్రీలంక ఓపెనర్ తిరుమన్నె హాఫ్ సెంచరీ చేయగా, మరో ఓపెనర్ దిల్షాన్ కొద్దిలో చేజార్చుకున్నాడు. 310 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంకకు ఓపెనర్లు 100 పరుగుల శుభారంభం అందించారు. లంక ఇన్నింగ్స్ లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో దిల్షాన్ (46) అవుటయ్యాడు. అలీ బౌలింగ్లో మోర్గాన్కు దొరికిపోయాడు. తిరుమన్నె (70), సంగక్కర (19) క్రీజులో ఉన్నారు. లంక 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది.