దక్షిణాఫ్రికా లక్ష్యం 369

దక్షిణాఫ్రికా లక్ష్యం 369 - Sakshi


ప్రస్తుతం 38/1

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 229/8 డిక్లేర్డ్


 

 కొలంబో: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు పూర్తి పట్టు సాధించింది. కుమార సంగక్కర (90 బంతుల్లో 72; 8 ఫోర్లు), కెప్టెన్ మాథ్యూస్ (83 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీల సహాయంతో శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 229/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని దక్షిణాఫ్రికా ముందు 369 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం సఫారీ తమ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.

 

  క్రీజులో ఎల్గర్ (46 బంతుల్లో 13 బ్యాటింగ్; 1 ఫోర్), డి కాక్ (31 బంతుల్లో 21 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. వెలుతురు సరిగాలేని కారణంగా 22 ఓవర్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. చివరి రోజు ఆటలో ఫామ్‌లో ఉన్న లంక స్పిన్నర్లను ఎదుర్కొని ఆమ్లా బృందం 331 పరుగుల భారీ స్కోరును సాధించాల్సి ఉంది. అంతకుముందు 11/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను మోర్కెల్ (4/45) కట్టడి చేశాడు. సంగక్కర, మాథ్యూస్ మధ్య నాలుగో వికెట్‌కు 81 పరుగులు జత చేరాయి. 70 బంతుల్లోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top