కుదురుకున్న సఫారీలు!
నాగ్ పూర్: నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కుదురుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 310 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆటలో లంచ్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఓ దశలో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను కెప్టెన్ హషీమ్ ఆమ్లా(28 బ్యాటింగ్), డు ప్లెసిస్(23 బ్యాటింగ్)లు చక్కదిద్దారు.
అంతకుముందు 32/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభించిన సఫారీలకు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ఆరంభమైన అరగంటకే ఎల్గర్(18), ఏబీ డివిలియర్స్ (9)లు పెవిలియన్ చేరారు. ఈ రోజు ఆటలో వీరిద్దరి వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకోవడంతో భారత్ మ్యాచ్ పై పట్టుబిగించింది. కాగా, ఆ తరువాత ఆమ్లా- డు ప్లెసిస్ ల జోడి 57 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో పాతుకుపోయారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలర్లను పదేపదే మార్చినా దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 215, రెండో ఇన్నింగ్స్ 173
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 79 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 105/4
సంబంధిత వార్తలు