కుప్పకూలిన దక్షిణాఫ్రికా
నాగపూర్: భారత స్పినర్లు మరోసారి సత్తా చాటారు. సఫారీ బ్యాట్స్ మన్ల పని పట్టారు. ఇండియా స్పిన్నర్ల ధాటికి దక్షిణాఫ్రికా స్వల్ప్ స్కోరుకే చాపచుట్టేసింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 79 పరుగులకే ఆలౌటైంది. టెస్టుల్లో భారత్ పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు.
11/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ టీమ్ 68 పరుగులు జోడించి 8 వికెట్లు కోల్పోయింది. డుమిని(35) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హార్మర్ 13, డూ ప్లెసిస్ 10 పరుగులు చేశారు. డివిలియర్స్, వాన్ జిల్ డకౌటయ్యారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
భారత బౌలర్లలో అశ్విన్ 5, జడేజా 4 వికెట్లు పడగొట్టారు. అమిత్ మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా 136 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 215 పరుగులకు ఆలౌటైంది.
సంబంధిత వార్తలు