అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం

అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం


కోల్కతా: మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి అకాలమరణం చెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబాన్ని ఆదుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ముందుకొచ్చారు. ఈ ఏడాది బీసీసీఐ తనకు అందించే పెన్షన్ను అంకిత్ కుటుంబానికి ఇవ్వాలని గంగూలీ నిర్ణయించారు. బీసీసీఐ పెన్షన్ స్కీము ప్రకారం దాదాకు ఏడాదికి 4,20,000 రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని అంకిత్ కుటుంబానికి అందజేస్తానని దాదా చెప్పారు.



అంతేగాక ఏడాది తర్వాత బోర్డు నుంచి వచ్చే పెన్షన్ను కూడా విరాళంగా ఇవ్వనున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తరపున ఆడే ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే వారి చికిత్స కోసం ఈ డబ్బును వినియోగించనున్నట్టు దాదా తెలిపారు. గంగూలీ క్యాబ్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇదిలావుండగా అంకిత్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు క్యాబ్ ప్రకటించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top