‘పసిడి' కూత

‘పసిడి' కూత


పుకెట్ (థాయ్‌లాండ్): ఆసియా బీచ్ క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు స్వర్ణం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 61-28తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. మమతా, ప్రియాంక, రన్‌దీప్ కౌర్, కకోలి బిస్వాస్, పాయల్ చౌదరి, పరమేశ్వరిల బృందం తొలి అర్ధభాగం ముగిసేసరికి 34-13 ఆధిక్యంలో నిలిచింది.



రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కనబర్చిన భారత బృందం మరో 27 పాయింట్లు నెగ్గగా, థాయ్‌లాండ్ 15 పాయింట్లతో సరిపెట్టుకుంది. మరోవైపు సెమీస్‌లో ఓడిన భారత పురుషుల జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 28-39తో పాకిస్థాన్ చేతిలో ఓడింది. ఓవరాల్‌గా ఈ గేమ్‌లో భారత్ 10 పతకాల (2 స్వర్ణాలు+ 1 రజతం+ 7 కాంస్యాలు)తో 20వ స్థానంతో సంతృప్తిపడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top