ఫైనల్లో సోనియా లాథర్
అస్టానా (కజకిస్తాన్): ఐబా ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో సోనియా లాథర్ (57కేజీ) ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన సెమీస్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తను 3-0తో ఖోజబెకోవా (కజకిస్తాన్)ను కంగుతినిపించింది. ఫైనల్లో అలెస్సియా మెసియానో (ఇటలీ)తో తలపడుతుంది.
24 ఏళ్ల సోనియా ఈ పోరులో నెగ్గితే స్వర్ణం కోసం భారత్ ఆరేళ్ల ఎదురుచూపులకు ముగింపు పలికినట్టవుతుంది. 2010లో మేరీ కోమ్ (48కేజీ) చివరిసారిగా విజేతగా నిలిచింది.