భారత్, బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా


ఢాకా: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) అండర్-23 చాంపియన్‌షిప్ అర్హత రౌండ్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. అయితే స్థానిక బంగబంధు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధం ముగియగానే ఫ్లడ్‌లైట్లు మొరాయించాయి. 40 నిమిషాలు వేచి చూసిన అనంతరం మ్యాచ్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లలో అంతకుముందటి జోష్ కనిపించలేదు. ఈ డ్రాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క పాయింట్ సాధించి నాలుగు జట్ల గ్రూపులో మూడో స్థానంలో నిలిచింది. దీంతో తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top