హైదరాబాద్ కెప్టెన్గా స్నేహా మోరె
ఆలిండియా మహిళల టోర్నీకి జట్టు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మహిళల అండర్-19 సూపర్ లీగ్ చాంపియన్షిప్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును శనివారం ప్రకటించారు. స్నేహా మోరె కెప్టెన్గా, అరుంధతి రెడ్డి వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ వన్డే టోర్నమెంట్ వచ్చే నెల 1 నుంచి 14 వరకు కొచ్చిలో జరగనుంది. సౌత్జోన్ నుంచి విజేత కర్ణాటకతో పాటు రన్నరప్ హైదరాబాద్ జట్టు ఈ టోర్నీకి అర్హత సంపాదించిన సంగతి తెలిసిందే.
అండర్-19 జట్టు: స్నేహా మోరె (కెప్టెన్), అరుంధతి, రమ్య, రచన, ప్రణతి రెడ్డి, హిమాని యాదవ్, గీతాంజలి, శ్రావణి, హర్ష పిళ్లై, శ్రావ్య, అంజులా జైన్, పట్లోళ్ల సుమ, లక్ష్మీప్రసన్న, శ్రవీణ, సాయికీర్తి; కోచ్: నూషిన్ అల్ ఖదీర్, మేనేజర్: అనురాధ.