స్టీవ్ స్మిత్ శతక్కొట్టుడు
పుణె: భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ శతకంతో మెరిశాడు. 187 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. 143/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ జట్టులో స్మిత్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 59 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన స్మిత్..భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొటూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
ఈ రోజు ఆటలో మిచెల్ మార్ష్(31), వేడ్(20) వికెట్లను ఆసీస్ నష్టపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 400 పరుగులకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 155 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. స్మిత్ 109 వ్యక్తిగత పరుగుల వద్ద ఏడో వికెట్ గా అవుటయ్యాడు.