సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్

సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్


జాతీయ సబ్ జూ॥క్యాడెట్ టీటీ టోర్నీ

సాక్షి, రాజమండ్రి: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి వరుణి జైస్వాల్ రజత పతకాన్ని సాధించింది. శనివారం ముగిసిన ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన వరుణి సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరుణి 13-11, 13-11, 7-11, 6-11, 4-11, 8-11తో అర్చన (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడింది. సెమీఫైనల్లో వరుణి 11-5, 11-7, 11-5, 11-7తో అనూష (మధ్యప్రదేశ్)పై, క్వార్టర్ ఫైనల్లో 11-5, 11-4, 7-11, 13-11తో ప్రియాంక (రాజస్థాన్)పై గెలిచింది.



సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో మానవ్ (పీఎస్‌పీబీ ‘ఎ’) విజేతగా నిలిచాడు. ఫైనల్లో మానవ్ 11-9, 15-13, 10-12, 11-4, 11-13, 11-9తో పార్థ్ (ఢిల్లీ)పై గెలిచాడు. క్యాడెట్ బాల,బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో జీహో (పీఎస్‌పీబీ ‘ఎ’) 10-12, 11-9, 11-6, 8-11, 11-4, 8-11, 12-10తో అల్బెర్టో (పీఎస్‌పీబీ ‘ఎ’)పై; వన్షిక 11-6, 8-11, 11-8, 11-8, 14-16, 12-10తో దియా (మహారాష్ట్ర ‘ఎ’)పై నెగ్గారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top