శ్రీజకు కాంస్యం

శ్రీజకు కాంస్యం


జాతీయ జూనియర్ టీటీ టోర్నీ



 అలెప్పీ (కేరళ): జాతీయ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కాంస్య పతకం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11-3, 11-5, 11-2, 11-6 స్కోరుతో మానసి (మహారాష్ట్ర)పై గెలిచింది. యూత్ టీమ్ విభాగంలో శ్రీజ రాణించడంతో తెలంగాణ బాలికల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top