యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్

యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్


దుబాయ్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్ జట్టు తరఫున యూఎస్ ఓపెన్ విజేత, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మారిన్ సిలిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టులో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో పాటు బౌచర్డ్, వోజ్నియాకి, ఇవానిసెవిచ్, మాలెక్ జాజిరిలు ఉన్నారు. టెన్నిస్ క్రీడాకారులకు ఐపీటీఎల్ మంచి వేదికని, ఈ టోర్నీలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని సిలిచ్ అన్నాడు. భారత్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దుబాయ్‌ల్లో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top