సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ విజేత కశ్యప్
లక్నో: సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ విజేతగా నిలిచాడు. కశ్యప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ కశ్యప్ 23-21, 23-21తో మరో తెలుగుతేజం, టాప్ సీడ్ శ్రీకాంత్ను ఓడించాడు. 52 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కశ్యప్ వరుస గేమ్లో గెలిచాడు. ఇక మహిళల సింగిల్స్లో తెలుగుతేజం సైనా నెహ్వాల్ టైటిల్ కైవసం చేసుకుంది.