శరత్‌ కమల్‌ సంచలనం

శరత్‌ కమల్‌ సంచలనం


న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌)వరల్డ్‌ టూర్‌ ఇండియా ఓపెన్‌ టోర్నీలో భారత వెటరన్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 62వ ర్యాంకర్‌ శరత్‌ కమల్‌ 11–8, 11–7, 11–4, 14–16, 11–5తో ప్రపంచ 24వ ర్యాంకర్‌ యుటో మురామత్సు (జపాన్‌)పై సంచలన విజయం సాధించాడు. శనివారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాల్‌ డ్రింకాల్‌ (ఇంగ్లండ్‌)తో శరత్‌ తలపడతాడు.



మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన సానిల్‌ శెట్టి 9–11, 11–9, 12–10, 4–11, 7–11, 7–11తో గార్డోస్‌ రాబర్ట్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణులు మౌసమి పౌల్, సుతీర్థ ముఖర్జీ, మౌమా దాస్, అర్చన కామత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.  



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top