భారత్ కు ఆఫ్రిది శుభాకాంక్షలు
కరాచీ: భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండియా' అంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. భారత్-పాక్ లు కలిసి ఉమ్మడిగా సహనశీలమైన శాంతియుత సమాజం కోసం కృషిచేయాలని సూచించాడు. పొరిగింటి వారిలా కాకుండా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించాడు. అంతా కలిసి మానవతా విలువల్ని కాపాడటానికి కృషిచేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఈ ఆశ వమ్ము కాకూడదంటూ 'హోప్ నాటౌట్' అన్న హ్యాష్ట్యాగ్ను జోడించారు.
ఇటీవల ఈ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది.. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి రిటైర్డ్ అనంతరం ఆఫ్రిది క్రికెట్ ఫౌండేషన్ నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు చెప్తున్నాడు. ఈ ఫౌండేషన్కు విరాట్ తను సంతకం చేసిన బ్యాట్ను విరాళంగా ఇచ్చాడు. దీంతో కోహ్లీకి ఆఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు. గతంలో భారత ఆటగాళ్లు సంతకం చేసి ఆఫ్రిదికి టీషర్ట్ను బహుకరించారు. ఆ టీషర్ట్ లండన్లో వేలం వేయగా రూ.3లక్షలు పలికింది.
Happy Independence Day India! No way to change neighbours, let's work towards peace, tolerance and love. Let humanity prevail.# HopeNotOut
— Shahid Afridi (@SAfridiOfficial) 14 August 2017